Header Banner

స్కూల్‌ విద్యార్థులకు శుభవార్త..! రూ.15 వేలు జమపై కీలక అప్‌డేట్!

  Thu May 22, 2025 12:06        Education

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విద్యార్థులకు కూటమి సర్కార్‌ శుభవార్త చెప్పింది. తల్లికి వందనం పథకం కింద కుటుంబం చదువుకుంటున్న పిల్లలందరికీ ఒక్కొక్కరికి రూ.15,000 చొప్పున బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని కూటమి సర్కార్‌ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. కూటమి సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత ఓ విద్యా సంవత్సరం కూడా ముగిసింది. ఇంకా తల్లికి వందనం పథకం కింద డబ్బు జమ చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. దీనిపై తాజాగా ప్రభుత్వం నుంచి కీలక అప్డేట్ వచ్చింది.

స్కూళ్లు తెరిచేలోగా తల్లుల అకౌంట్‌లోకి రూ.15 వేలు జమ చేయనున్నట్లు కూటమి సర్కార్ తెలిపింది. సంక్షేమ పథకాల వార్షిక క్యాలెండర్ విడుదల చేయాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అందులో ఏ నెలలో ఏ పథకం అమలు చేస్తామనే వివరాలు ప్రజలకు తెలియజేయాలని అన్నారు. తల్లికి వందనం పథకం కింద స్కూళ్లు తెరిచేలోగా విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లోకి రూ.15 వేలు జమ చేస్తామని సీఎం చంద్రబాబు అన్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఒకే విడతలో ఈ నిధులు జమ చేస్తామని తెలిపారు. కాగా తల్లికి వందనం పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారి కార్యక్రమాల్లో ఒకటి. ఇది సూపర్ సిక్స్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా అమలు చేస్తున్నారు. ఈ పథకం తల్లుల్ని ఆర్థికంగా ప్రోత్సహించి, వారి పిల్లలకు విద్యను అందించడమే లక్ష్యంగా రూపొందించబడింది.

అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం కూడా తీసుకుంది. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాహనదారులకు ఊరట కలిగించేలా మరో ప్రకటన చేసింది. గత ప్రభుత్వం విధించిన గ్రీన్ టాక్స్‌ను తగ్గిస్తున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో సరకు రవాణా చేసే వాహనదారులకు ఆర్థికంగా భారం భారీగా తగ్గనుంది.


ఇది కూడా చదవండి: ఏపీలో కొత్త నేషనల్ హైవే నాలుగు లైన్లుగా.. ఈ రూట్‌లో భూసేకరణ! ఇక 8 గంటల్లో విశాఖ!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

 

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:


ఏపీలో ఆ ఉద్యోగులందరికి పండగే పండగ..! కీలక ఉత్తర్వులు జారీ!


హైదరాబాద్‌లో మయన్మార్ వాసుల కలకలం..! నకిలీ పత్రాలతో ఆధార్, పాన్!


ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!


ఏపీ ప్రజలకు మరో సూపర్ న్యూస్..! ఏడాదికి రూ.2.5 లక్షలు బెనిఫిట్ ఉచితంగానే!


టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!


అసైన్డ్ భూముల ఫ్రీహోల్డ్ పై మంత్రివర్గ కీలక నిర్ణయాలు! ఇక నుండి ఇలా...!


పాఠశాలల్లో రోజూ ఒక గంట యోగా తప్పనిసరి! సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం!


విమానానికి త్రుటిలో తప్పిన ఘోర ప్రమాదం! 160 మంది ప్రయాణికులతో..


అన్నదాత సుఖీభవ' నిధులు జమ అప్పుడే..! తాజా నిర్ణయంతో..!


ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group




   #andhrapravasi #SchoolStudents #GoodNews #₹15000Update #StudentWelfare #EducationSupport #APStudents